ఢిల్లీి , నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ఢిల్లీి లో జరిగిన స్కాచ్ (స్కాచ్) అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణ మరియు రజత పురస్కారాలను కైవసం చేసుకొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ డెవలప్ చేసిన రిటర్న్ స్క్రూటినీ ఆటోమేషన్ టూల్ మరియు GST మిత్ర అనే రెండు సాఫ్ట్వేర్ అప్లికేషన్ లకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ ముళ్ళపూడి జయకృష్ణ , డిప్యూటీ కమిషనర్ మరియు చావా హిమబిందు,అసిస్టెంట్ కమిషనర్ ఆ శాఖ తరపున ఈ పురస్కారం అందుకున్నారు.
Prajavartha Online Telugu News