– వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త ఆశలు, ఆకాంక్షలతో 2025 లోకి అడుగు పెడుతున్న సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదల, కృషితో సవాళ్లను అధిగమించి ప్రజలందరూ విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన లక్ష్యాలను చేరుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి 2025 సంవత్సరం స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2025 గుర్తుండిపోవాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News