అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసి రూ.10,46,169 చెక్కును అందించారు. సీఎంకు చెక్కును అందజేసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డి.గోపాలకృష్ణ, వరప్రసాద్, తదితరులు ఉన్నారు. గతేడాది విజయవాడలో వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమవంతుగా విరాళంగా ఇచ్చినట్లు వారు తెలిపారు.
Prajavartha Online Telugu News