Breaking News

జనవరి 30 కల్లా ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలను గజం కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 30 ఆఖరితేదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు. పాయకాపురం, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలను గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుందని, ఇంకా ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ఎవరివైతే చేయించుకోవాలో జనవరి 30 తేదీ కల్లా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని, ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *