Breaking News

రాబోయే విద్యా సంవ‌త్స‌రం నుంచి త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ప్రారంభం కాబోతుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సొంత నిధుల‌తో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
-విజ‌య‌వాడ -తిరువూరు డివిజ‌న్ల‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు అంద‌జేత‌
-కెబిఎన్ కాలేజీలో జ‌రిగిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్య‌క్ర‌మం
-జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో త్వ‌ర‌లో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టిన నాటి నుంచి విద్యాశాఖ లో వినూత‌న్న మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల విద్యార్ధులు క్రీడ‌ల్లో రాణించేందుకు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం సంపూర్ణ స‌హ‌కారం అందిస్తుంది. అలాగే రాబోయే విద్యా సంవ‌త్స‌రం నుంచి త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద ప్ర‌తి విద్యార్ధికి రూ.15 వేలు అందుతాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం మే నుంచి త‌ల్లి ప‌థ‌కం అమ‌లు చేయ‌నుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు త‌న సొంత నిధుల‌తో 8 క్రీడ‌ల‌కు సంబంధించిన క్రీడావ‌స్తువుల‌తో క్రీడా వికాసం పేరుతో స్పోర్ట్స్ కిట్స్ ఎంపి కేశినేని శివ‌నాథ్ అంద‌జేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జ‌న్మ‌దినం నాడు ప్రారంభించి విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు క్రీడావికాసం స్పోర్ట్స్ కిట్స్ అంద‌జేశారు. బుధ‌వారం కెబిఎన్ కాలేజీలో విజ‌య‌వాడ తూర్పు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్, మైల‌వ‌రం, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల్లోని 67 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు క్రీడా వికాసం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు.

తూర్పు నియోజ‌క‌వ‌ర్గం లో 5, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 10, తిరువూరులో 27, మైల‌వ‌రంలో 25 ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ క్రీడా వికాసం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు ఎంపి కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో అందించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ లో వాలీబాల్ నెట్స్, వాలీబాల్స్, త్రో బాల్ నెట్స్, త్రో బాల్స్, టెన్నికాయిట్ నెట్స్, టెన్నికాయిట్స్, హ్యాండ్ బాల్స్, షటిల్ నెట్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డ్ అండ్ కాయిన్స్, ఖో-ఖొ పోల్స్, బాల్ బ్యాడ్మింటన్ కిట్, హై జంప్ స్టాండ్స్, టేక్ ఆఫ్ బోర్డ్ వున్నాయి.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రౌండ్స్ అధ్వాన్నంగా తయారై విద్యార్ధులు ఆటలకు దూరంగా వున్నారన్నారు . ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విధ్యార్ధులు చదువుల్లోనే కాదు..ఆటల్లో కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు.అందుకే తన సొంత నిధులతో జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ అభివృద్ది చేయించి లాంగ్ జంప్ పిట్స్ సిద్దం చేయంచినట్లు తెలిపారు. అలాగే విద్యార్ధులకు అవసరమైన క్రీడా వస్తువులను కూడా జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో వుంటుంద‌న్నారు

తనకి ఇష్టమైన నాయకుల్లో మంత్రి నారా లోకేష్ ఒక్కరని… ఆయ‌న‌ విద్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్య వ్యవస్థలో వినూతన్న మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేసేందుకు మెగా పెరెంట్ టీచర్ మీటింగ్ ఒక పండుగ గా నిర్వహించాడని గుర్తు చేశారు. ఇక కాలేజీ విద్యార్ధులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాడన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలి అదే ప్రజా ప్రభుత్వ ధ్యేయమ‌ని ప్ర‌క‌టించారు. అందుకోసం మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్ర‌మిస్తున్నార‌న్నారు.

విద్యార్ధుల‌కు చ‌దువుతో పాటు క్రీడ‌లు కూడా ముఖ్యం..అందుకే మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో రెండు క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విక‌సిత్ ఎపి 2047 విజ‌న్ తో రాష్ట్రాన్నిపురోగ‌భివృద్ది దిశ‌గా తీసుకువెళుతున్నార‌ని కొనియాడారు.

వీరి స్పూర్తి తో ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు స్పోర్ట్స్ కిట్స్ త‌న సొంత నిధుల‌తో పంపిణీ చేయ‌టం చాలా సంతోషంగా వుంద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల విద్యార్ధులు క్రీడ‌ల్లో రాణించేందుకు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం సంపూర్ణ స‌హ‌కారం వుంటుంది.

ఎన్టీఆర్ జిల్లాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్దుల‌కు జిల్లా స్పోర్ట్స్ మీట్ నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక చేస్తున్న‌ట్లు తెలిపారు. రాబోయే క్రిస్మ‌స్ సంక్రాంతి పండుగ‌ల మ‌ధ్య నిర్వ‌హిస్తామ‌న్నారు. అందుకు కావాల్సిన స‌దుపాయాలు అంద‌జేస్తాన‌ని తెలిపారు. అలాగే విద్యార్ధులు క్రీడల్లో నైపుణ్యం సంపాదించ‌టానికి స‌మ్మ‌ర్ క్యాంప్స్ నిర్వ‌హిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు స‌మ‌స్య‌లు వుంటే త‌న దృష్టి తీసుకురావాల‌ని…అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించి అండ‌గా వుంటాన‌న్నారు.

ఈ స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించిన‌ డీ.ఈ.వో సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల మైదానాలు అభివృద్ది చేయటంతో పాటు స్పోర్ట్స్ అందించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్ధులను చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు నెల‌ల క్రితం కెబిఎన్ కాలేజీలో జ‌రిగిన డిస్ట్రిక్ పిడి రివ్యూ మీటింగ్ లో చెప్పిన విధంగా జిల్లా వ్యాప్తంగా వున్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల మైదానాలు బాగు చేయించి, పాఠ‌శాల‌ల‌కు అవ‌స‌ర‌మైన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయ‌టం చాలా గొప్ప విష‌య‌మ‌ని, ప్ర‌భుత్వ నిధుల‌తో కాకుండా సొంత నిధుల‌తో అభివృద్ది ప‌నులు చేప‌ట్టే నాయ‌కులు అరుదుగా వుంటార‌ని, ఆ వ‌రుస‌లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ముందు వుంటార‌ని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్.కె.పి.వి.వి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఎ.వో డాక్ట‌ర్ వి.నారాయ‌ణ రావు, కెబిఎన్ సెక్ర‌ట‌రీ, క‌ర‌స్పాండెంట్ డాక్ట‌ర్ టి.శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లాహ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *