-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జనవరి 29 వ తేది నుండే ఎన్నికల నియమావళి అమలులోఉన్నందున ఈనెల 3వ తేదిన జిఎంసిలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని, కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు అంశాన్నిగమనించి సహకరించాలని, తమ స్థానిక సమస్యల ఫిర్యాదులను జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103, 104 కి కాల్ చేయవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News