Breaking News

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగిన జాతీయస్థాయి క్యాడిట్ (అండర్ 14) మరియు సీనియర్ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొత్తం 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని మొత్తం 46 పతకాలను గెలుచుకున్నారు. వీటిలో 19 బంగారు పతకాలు, 16 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావు, పసుపులేటి గౌరీశంకర్ పతకాలు గెలుపొందిన క్రీడాకారులతో కలిసి కలెక్టర్ డా. జి.లక్ష్మీశను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పతకాలు సాధించిన చిన్నారులను కలెక్టర్ అభినందించారు. మరింత కష్టపడి శిక్షణ తీసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని.. జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావును కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేకంగా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *