మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానాన్ని బుధవారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ బాలాజీ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నాగ పుట్ట వద్ద పాలు పోసి, నాగపుట్ట పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు
Prajavartha Online Telugu News