Breaking News

పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి శని, ఆదివారం శెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించబడవు

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి ఎన్నికల కమీషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ది.03.02.2025 నుండి ది.10.02.2025 (సెలవు దినాలు మినహాయించి) నామినేషన్లు స్వీకరించబడును. నేగోషియబుల్ ఇనస్ట్రమెంట్ యాక్ట్ (negotiable Instrument Act, 1881 (by the Finance Ministry) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఉత్తర్వులు నెం.4/ECI/1-ET/FUNC/JUD/SDR/VOL.1/2016, తేది.29.12.2016 అనుసరించి, ది.08.02.2025 (రెండవ శనివారం) మరియు ది.09.02.2025 (ఆదివారం) తేదిలలో తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి నామినేషన్లు స్వీకరించబడవని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *