విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుమ్మరిపాలెం సెంటర్ కు చెందిన కరెద్దుల గంగాధర్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 68,430 చెక్కును ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెడ్ల గంగాధర్ వెన్నెముకకు యూనియన్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిందన్నారు. శస్త్ర చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 68,430 చెక్కును లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News