తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారిని నేటి శుక్రవారం ఉదయం ప్రాతః కాల సమయంలో అభిషేక సేవలో సేవించుకుని దర్శించుకున్న ఆం.ప్ర. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. శ్రీవారి దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయం నందు సిఎస్ కి సాదర వీడ్కోలు పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్. ఈ సందర్భంగా సిఎస్ కి తిరుమల శ్రీవారి జ్ఞాపికను జిల్లా కలెక్టర్ అందచేశారు. అంతకు మునుపు ఉదయం సిఎస్ ని కలెక్టర్ రిసీవ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహశీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News