Breaking News

దామోదరం సంజీవ‌య్య నిరాడంబ‌ర‌త‌, నిజాయితీ, కార్య దక్షత నేటి తరానికి ఆదర్శం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా సాంఘిక సంక్షేమ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి త‌దిత‌రులు దామోదరం సంజీవ‌య్య చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. దామోదరం సంజీవ‌య్య నిరాడంబ‌ర‌త‌, నిజాయితీ, కార్య దక్షత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయ‌న్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *