Breaking News

నాడీ శోధనతో ఆరోగ్య ఖర్చు తగ్గింపు…. : డా. మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ఉచిత నాడీ శోధన కార్యక్రమం నిర్వహించారు.
నాడీ శోధనతో ఆరోగ్య ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మానవదేహంలోని 12 అవయవాలు పంచభూతాల వలె పని చేస్తాయని వాటిలో హెచ్చుతగ్గులు నాడీ శోధనతో తెలుసుకొని మానవదేహంలోనే ఉన్నా ప్రాణ శక్తి కేంద్రాలను చైతన్య పరచడంతో విరిగినవి, తెగినవి మరియు కుళ్ళినవీ తప్ప మిగతా అనారోగ్యాలను సైతం తగ్గించవచ్చునని తెలిపారు. నాడీ శోధనతో వచ్చిన మూల సమస్యలను గుర్తించి చికిత్స చేయటంతో అతి తక్కువ ఖర్చుతో తెలిసిన వ్యాధులు,తెలియనివి మరియు రాబోయే రుగ్మతలను తగ్గి అసహజ మరణాలు గణనీయంగా తగ్గించవచ్చునని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పలువురు పాల్గొని క్యాంపును సద్వినియోగం పరుచుకున్నారు. ఈ క్యాంపులో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గోపి సుధా మరియు కొండవీటి సుమతి సేవలు అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *