– డీఈవో యూవీ సుబ్బారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు (టీసీసీ-2025) పరీక్షలు జరగనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ కొత్తపేటలోని ఎస్కేపీవీవీ హైస్కూల్ కేంద్రంలో ఉదయం 10 గం. నుంచి 12.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ కేటగిరీల్లో పరీక్షలు జరుగుతాయని డీఈవో వివరించారు.
Prajavartha Online Telugu News