మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరుతో పాటు గుర్తింపు తీసుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డికె బాలాజీ అన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి అవార్డు అందుకున్న ముంతాజ్ బేగం, రిపబ్లిక్ డే సందర్భంగా డిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలవద్ద వీణవాదంతో ప్రశంసలు పొందిన అప్పికట్ల దీప్తి, రాజస్థాన్ లో జరిగిన
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మూడు పతకాలు సాధించిన తోట విజయకుమారిలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్లో శాలువాలు, జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News