రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం లో వృక్షం నాటిన జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా వృక్ష సంపద కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న వృక్షాన్ని ఎస్పీ కార్యలయం వద్ద నాటడం జరిగిందనీ, సమాజ హితం కోరే ఇటువంటి ఘటనలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలి అని జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News