– ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీలు
– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా పటిష్ట పర్యవేక్షణతో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇసుక లేదా మట్టి రవాణాకు సంబంధించి వచ్చే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదికల సమర్పణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జి.కొండూరు మండలం, కోడూరు గ్రామ కొత్త చెరువుతో పాటు చిన నందిగామ వద్ద డంప్ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఏపీఎస్సీఎస్సీ లిమిటెడ్ డీఎం, మైన్స్ డీడీ, విజయవాడ రూరల్ తహసీల్దార్, మైలవరం మండలం సర్వేయర్, సంబంధిత వీఆర్వోలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం, కొంగర మల్లయ్యగట్టు వద్ద అక్రమ క్వారీయింగ్ ఆరోపణలపైనా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీఎస్సీఎస్సీ లిమిటెడ్ డీఎం, మైన్స్ డీడీ, విజయవాడ రూరల్ తహసీల్దార్, మైలవరం మండలం సర్వేయర్, సంబంధిత వీఆర్వోలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్దేశ ప్రాంతాల్లో పటిష్ట నిఘాకు కూడా ఈ కమిటీలు పనిచేస్తాయని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ తవ్వకాలు లేదా రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.
Prajavartha Online Telugu News