Breaking News

ఏపీలో ప్రశాంతంగా జరిగిన పదో తరగతి పరీక్షలు

-తొలి రోజు పరీక్షకు 98.27 శాతం మంది హాజరు

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గానూ 6,16,451 మంది విద్యార్థులు హాజరు కాగా, 10,826 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపియింగ్ కు పాల్పడ్డారని, ఆ ఇద్దరిని డిబార్ చేసినట్లు పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS.,  తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *