మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి దృష్ట్యా కోనేరు సెంటర్లో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల దప్పిక తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News