Breaking News

ముస్లిం సోదరసోదరిమణులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత సామరస్యాన్ని పెంపొందించి ఐక్యతను చాటే పర్వదినం పవిత్ర రంజాన్ అని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిసోదరులు అందరికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి ఆ అల్లాహ్ కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆ అల్లా అనుగ్రహించలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే.. మరలా ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో మరోమారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ఆ అల్లా దీవెనలు అందించాలని అవినాష్ కోరుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *