Breaking News

విజయవాడలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి చంద్రన్న  వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుండి 20 వ తేదీ వరకు నాటికి పోటీలో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జానపద నృత్య పోటీలు నిర్వహించి ఏప్రిల్ 20 వ తేదీ వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుచున్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఏ ఎమ్ రత్నం ప్రధాన కార్యదర్శి మోహన్ గౌడ సంయుక్తంగా కలిసి పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ మరియు సిఫా అధ్యక్షులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో కనివిని ఎరుగని రీతిలో ఘనంగా కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గతంలో నాడు 2000 సంవత్సరంలో స్వర్ణోత్సవ వేడుకలు నేడు 2025 వజ్రోత్సవ వేడుకలు నిర్వహించు చున్న ఒకే ఒక్కడు సిని దర్శకులు వెంకటరమణ పసుపులేటి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమృత వర్షిణి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు, అశోక్ కొప్పుల, బొర్రా నర్సయ్య, సయ్యద్ జాఫర్, డీ రామ్ బాబు, ఎన్ వి లక్ష్మీ దేవి, సీనియర్ ఆర్టిస్ట్ సీనియర్ జర్నలిస్టు ప్రజా నాట్య మందలి ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు జి వి రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *