విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం హెచ్ బీ కాలనీలో నివాసముండే పతంగి ఝాన్సీ కొంతకాలంగా కిడ్నీ మరియు ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం చేయాలని వైద్యులు సూచించారు. చికిత్సకు అయ్యే డబ్బు వారి వద్ద లేకపోవడంతో టిడిపి మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబును సంప్రదించారు. ఆయన భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ఈ మేరకు సోమవారం మంజూరైన రూ 5 లక్షల ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని బాధితురాలు తనయుడు శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అందజేశారు. త్వరితగతిన చెక్కు మంజూరుకు సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపాడు. ఎన్డీఏ కూటమి నేతలు దుర్భేసుల హుస్సేన్, అలుగుండ్ల సుబ్బారెడ్డి, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News