Breaking News

శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ నది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ…. పెనుమాక గ్రామంలో కల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజులపాటు 365 రోజులపాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించమన్నారు. ముగింపు కార్యక్రమానికి సంకేతంగా బాబూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుండి 13 వ తేదీ వరకు 50 వేల మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. . ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులను అయోధ్య రామమందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు.
అనంతరం ప్రముఖ గాయకులు ఎం.ఎస్ రామారావు మనువడు ఎం.ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ…ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి 8 గంటల వరకు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు.శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఇంతటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *