Breaking News

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేసి సంతాపం  దుర్గాపురం వాకర్స్ అసోసియేషన్ క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈరోజు విజయవాడ దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గాపురం వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ నందు అధ్యక్షులు ఎస్కే బాబు అధ్యక్షతన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన ద్వారా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని  దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె. బాబు మాట్లాడుతూ దేశంలో ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి దుస్థితిని చూసి ఉగ్రవాదుల నీచాతి నీచమైన హేయమైన చర్యలను నరరూప రాక్షసులుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వి.గురునాథం వెంకట కృష్ణారావు, సత్యనారాయణ, వంశీ, పైడ్రాజు, మురళి, ఆంజనేయులు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, కోటేశ్వరరావు, వలి, హేమేశ్వరరావు, రామకృష్ణ, బాబురావు, రాము, విజయలక్ష్మి తదితర మహిళా వాకర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *