అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన వెంకట సత్యనారాయణ పాకా మంగళవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి కి ఆయన తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News