చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
చందర్లపాడు గ్రామంలో జరుగుతున్న అలివేలమ్మ తిరుణాల మహోత్సవంలో lసోమవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తో కలిసి పాల్గొన్నారు.. అలివేలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరణాల సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన చేయడానికి విచ్చేసిన జబర్దస్త్ టీంకు అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు గ్రామం శ్రేయస్సును కాపాడతారని, గ్రామస్తులకు సుఖసంతోషాలను అందిస్తారని తెలిపారు. ఆ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని అందరు సుఖసంతోషాలతో ఆయురార్యోగ్యలతో ఉండాలని అలివేలమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు
Prajavartha Online Telugu News