-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారు “ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ” లో పాల్గొంటున్న సందర్భంగా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం రాత్రి, శుక్రవారం ఉదయం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ను పరిశీలించారు. కార్యక్రమం నిర్వాణ బాధ్యతలను అధికారులకు ఆదేశిస్తూ, నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ప్రజలకు త్రాగునీటి, మజ్జిగ సౌకర్యాలను కల్పించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు స్టేడియంలోపల, ర్యాలీ చేసే దారిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం అయిన వెంటనే పారిశుధ్య నిర్వహణ పక్కగా జరగాలని, జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా పారిశుధ్య నిర్వహణ లో జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News