విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి )ను ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పరామర్శించారు. ప్రమాదవశాత్తు లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సుజనా చౌదరిని కలిసి పరామర్శించారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి ఈశ్వరరావు, కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు చెన్నుపాటి వజీర్, ఏ సురేష్ , ఎ వి బి సత్యనారాయణ, యలమంచిలి శ్రీధర్, సూరపనేని సురేష్ తదితరులు పరామర్శించారు.
Prajavartha Online Telugu News