విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో సుజనా చౌదరిని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి త్వరగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News