అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకరిస్తోంది. ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకు నీరందేలా… చివరి భూములను సైతం తడిపేలా.. అత్యధిక సామర్థ్యంతో హంద్రీ-నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తున్నాయి. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరందించాలనే మా కల సాకారమవుతోంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తోంది.
Prajavartha Online Telugu News