Breaking News

ఘనంగా ఉప్పులూరి మల్లికార్జునశర్మ 88వ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది ఉప్పులూరి మల్లికార్జున శర్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని శారదా కళాసమితి అధ్యక్షుడు డోగిపర్తి శంకరరావు అన్నారు. జానకి మల్లికార్జున చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఉప్పులూరి మల్లికార్జునశర్మ 88వ జయంతి వేడుకలు. పప్పు సదాశివశాస్త్రికి మల్లికార్జన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. శంకరావు మట్లాడుతూ మల్లికార్జున శర్మ చిన్నవయస్సులోనే జాతీయ ఉద్యమ వైపు మొగ్గు చూపారన్నారు. మధ్య విమోచన, గాంధీ శాంతి, అహింస కోసం కృషి చేసినట్లు తెలిపారు. జానకీ మల్లికార్జున… శ్రీనివాస శర్మ నేతృత్వంలో అన్నమయ్య సంకీర్తనల ప్రచారకుడు పప్పు సదాశివశాస్త్రికి మల్లికార్జున శర్మ స్మారక పురస్కారం అందచేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సత్య నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు కందుకూరి సత్యవతి ఆధ్వర్యంలో పులి శీతల్, బత్తుల మధులాలస నాట్యం సంప్రదాయంలో పలు అంశాలను ప్రదర్శించారు. పప్పు సదాశివ శాస్త్రి అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బోడె ఆంజనేయరాజు, కే.సుబ్బరామయ్య, రాంపిళ్ళ జయప్రకాష్, చట్లపల్లి మారుతీ ప్రసన్న, సాహితీవేత్త ఉప్పులూరి మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *