Breaking News

ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుపూర్ణిమ సందర్భంగా ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరంలో బుధవారం అత్యంత వైభవముగా బాబా వారికి గురుపూర్ణిమ వేడుకలు  జరుపబడినది. ఇందులో భాగంగా తెల్లవారుఝామున 4 గంటలకు కాకడ హారతి, తదుపరి గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, సహస్ర కలశ పంచామృత స్నపన జరిగింది.  స్వామి వారికి ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తులు ఈ రోజు ఉదయం అంతా కూడా సుమారు 15000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మందిరములో  ప్రస్తుత కార్యదర్శి కుంచనపల్లి రవి శంకర్ దంపతులచే  అందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.  ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అత్యంత వైభవోపేతంగా మేళతాళములతోటి పల్లకి ఉత్సవం నిర్వహించబడినది.  ఈ విశేషమైన రోజున రోజు మొత్తం మీద సుమారు 25,000 మంది భక్తులు బాబా వారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *