Breaking News

ఈనెల 4న మినీ జాబ్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మినీ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో గల జిల్లా ఉపాధి కేంద్రంలో జరిగే ఈ జాబ్ మేళాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిప్లొమా, డిగ్రీ, బి-టెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మినీ జాబ్ మేళాలో 4 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులను కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని కలెక్టర్ ఢిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు. అసక్తి కలిగిన అభ్యర్థులు https://tinyurl.com/Minijune ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కోసం 9700092606/ 9603368324 నందు సంప్రదించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *