-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం బోటుపైన బందరు కాలువ పర్యటించి, కాలువలో ఉన్న వ్యర్ధాలను పరిశీలించారు. కాలువల్లో ఎటువంటి వ్యర్ధాలు వేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, కాలువల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాలువల్లో గుర్రపుడెక్కలు పెరగకుండా,ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి అని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News