-మంగళవారం ఆర్ట్స్ కళాశాల నుంచి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు 2 కే రన్ -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “సీ ఫెస్టివల్” వేడుకలు రాష్ట్రంలో విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం, రాజమహేంద్రవరం లో నిర్వహించకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో సీ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, సీ ఫుడ్ యొక్క వినియోగాన్ని పెంచడం లో భాగంగా …
Read More »Tag Archives: rajamandri
విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు…
రాజమహేంద్రవరం / కాకినాడ / అమలాపురం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు వ్యవసాయ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్: ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్. మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో భాగంగా పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి తొమ్మిది గంటలు నిరంతరాయముగా 3-ఫేజ్ …
Read More »వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు జీ జీ హెచ్ ప్రిన్సిపల్ డా బి. సౌభగ్య లక్ష్మి శుభాకాంక్షలు తెలియ చేసారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ తో కూడి వైద్య విద్యను అభ్యసించి, మన కళాశాల కు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ కళాశాల కు 4 కేటగిరీ లలో కేటాయించిన 150 సీట్ల కు గాను …
Read More »సెప్టెంబర్ 9 న జాతీయ లోక్ అధాలత్
-న్యాయ సేవలు, చట్టాలు, అర్హులకు అందించే పథకాల పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.. -అర్హులందరికీ ప్రతి పథకం వర్తింపచేయాలి.. -విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించాలి.. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు డిఎల్ఎస్ఏ అధ్యక్షులు శ్రీమతి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ పేర్కొన్న 15 ప్రాంతాల్లోని 64 కోర్టుల యందు ది. 9.9.2023 న ( 2వ శనివారం) …
Read More »రాజమహేంద్రవరం రూరల్ 97 శాతం ఓటర్ సర్వే పూర్తి
-బి ఎల్ ఓ, సూపర్వైజర్ పెండింగ్ దరఖాస్తు 100 శాతం అప్లోడ్ చెయ్యండి -పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై కార్యశాల -భౌతికంగా తీసుకున్న ధరఖాస్తుల డేటా ఎంట్రీ పనులను పరిశీలన -జేసీ కె. తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటి సర్వే ద్వారా స్వీకరించిన ప్రతి ఒక ఓటరు గుర్తింపు వివరాలు నూరుశాతం డేటా ఎంట్రీ పూర్తి చెయ్యాలని రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గ ఎలక్టోరల్ అధికారి / జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. …
Read More »గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కల్పనకు కృషి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహద పడతాయని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామం నందు జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జి.ఎస్.ఎల్ మరియు సుభద్ర హాస్పటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు ముందుగా రఘుదేవపురం గ్రామంలోని సాయిబాబా గుడి నందు ప్రత్యేక …
Read More »అన్ని కేసులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి…
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి చేయడం జరిగిందని సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అనపర్తి నియోజక వర్గ పరిధిలో ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, ఇతర ఆరోగ్య, అనుబంధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి. యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, పి హెచ్ సి , సి హెచ్ సి పరిధిలో వచ్చే …
Read More »సంక్షేమ పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, స్వచ్ఛంధ సేవ సంస్థలతో సమావేశం నిర్వహించారు. అసంఘటిత కార్మికులకు వారి హక్కులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించాలని పేర్కొన్నారు . ఆమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు …
Read More »ఆగస్టు 30 నిడదవోలు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి
-వర్షాల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చెయ్యాలి -క్షేత్ర స్థాయి లో ముందస్తు ఏర్పాట్లు పరిశీలన -జేసీ తేజ్ భరత్, ఎమ్ సి కే. దినేష్ కుమార్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 30 వ తేదీ నిడదవోలు పట్టణంలో నిర్వహించే “వైస్సార్ కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. …
Read More »అధిక వర్షాల నేపథ్యంలో సిఎం పర్యటన వాయిదా
– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి నిడదవోలు పర్యటన “అధిక వర్షాలు” నేపథ్యంలో ఆగస్ట్ 30 కు వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వర్షాల కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు లో పాల్గొననున్న ” వై ఎస్ ఆర్ కాపు నేస్తం ” రాష్ట్ర స్థాయి కార్యక్రమం …
Read More »
Prajavartha Online Telugu News