విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి క్రీడాకారుడు ఛాంపియన్ కాలేక పోయినా, క్రీడలు జీవితంలో ఎలా రాణించాలో నేర్పుతాయని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియుం లో “యూత్ స్పోర్ట్స్ రిక్రియేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా టెన్నిస్ పోటీలలో విజేతలను ఉద్దేశించి ఆయన ఆదివారం ప్రసంగించారు. క్రీడలు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడానికి, వాటిని సాధించడానికి పట్టుదలతో, క్రమశిక్షణ తో పనిచేసేందుకు దోహద పడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులుగా ఎదిగే ప్రతి ఒక్కరూ ఉన్నత …
Read More »Tag Archives: vijayawada
చాత్తాద శ్రీ వైష్ణవులకు కార్పోరేషన్ మంజూరు చేయాలి…
– సంఘ అధ్యక్షులు జె.సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చాత్తాద శ్రీ వైష్ణవులకు కూడా కార్పోరేషన్ మంజూరు చేయలని సంఘం అధ్యక్షులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరము అనేక విధముల సహాయం చేయుచున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా సంఘాన్ని కూడా గుర్తించి ప్రోత్సాహం అందించాలని ఏ విధమైన ప్రగతిలేని చాత్తాద శ్రీ వైష్ణవులను బి.సి. సబ్ ప్లాను …
Read More »పార్టీ విజయానికి బూత్ లెవల్ ఏజెంట్లే వెన్నెముక : మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40, 50, 55 డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణ తరగతులు మరియు ముఖ్య సమావేశం ఆదివారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి, స్పెషల్ సమ్మరి రివిజన్ మరియు ఏజెంట్లకు ఎన్నికల విధులపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, పశ్చిమ వైసిపి పరిశీలకులు …
Read More »క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా విత్తన, సాగునీరు, ఎరువుల ప్రణాళికలా?
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో పరిశీలనలు, చర్యలు లేకుండా విత్తన, సాగునీరు, ఎరువుల ప్రణాళికలు సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సాగునీరు అందించేందుకు తగు నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలని, రైతుల అవసరాల మేరకు కనీసం 90% సబ్సిడీతోనైనా అన్ని రకాల పంటలకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఎరువుల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ-క్రాప్తో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …
Read More »ఈ నెల 11న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ…
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …
Read More »వాణిజ్య పన్నుల శాఖకు వెన్నంటే ఉంటాం..
-సమస్యల పరిష్కారానికి కృషి -వేతన సవరణ కమిషన్ నియామకానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం -13 లక్షల మంది ఉద్యోగుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం -ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజీవో సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన, సంక్షేమ పరిరక్షణ కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లుతూ నిరంతరం కృషిచేస్తున్నామని తెలిపారు. వాణిజ్య పన్నుల …
Read More »కృష్ణా జిల్లాలో ఘనంగా మదర్స్ డే వేడుకలు
-బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా పెనమలూరు మండలం గోశాల గ్రామంలోని బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో ఆదివారం మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా హాజరై ఆశ్రమంలోని వృద్ధ మహిళలతో ఆప్యాయంగా మమేకమయ్యారు. మదర్స్ డే సందర్భంగా మంత్రి అనిత ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆశ్రమ మహిళలతో కలిసి కేక్ …
Read More »కృష్ణలంక పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లకు జీబ్రా లైన్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రహదారి ప్రమాదాలను అరికట్టడానికి మరియు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి అదేశాల మేరకు ట్రాఫిక్ డి.సి.పి.శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో 5 ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాల మురళి కృష్ణ, వారి సిబ్బంది మరియు మున్సిపల్ కార్పొరేషన్ (VMC) అధికారుల సమన్వయంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీపం సత్యం గారి హోటల్ జంక్షన్ రాఘవయ్య పార్క్ ప్రాంతం అమెరికన్ …
Read More »పాఠశాల ఫస్టు విమాన యానం చేయించిన ఉపాధ్యాయులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాల ఫస్ట్ 581 మార్కులు సాధించినందుకు గాను A. హేమంత్ ప్రత్యేక విమానం ద్వారా విద్యా శాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయలాజికల్ అసిస్టెంట్ మిరియాల కృష్ణారావు తన సొంత ఖర్చులతోటి ఆ విద్యార్థిని విమానయానం చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి మార్కులతో పాటు మంచి అనుభవాన్ని …
Read More »
Prajavartha Online Telugu News