విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
8వ డివిజన్ ఇజ్రాయిల్ పేటకు చెందిన పచ్చగళ్ల యోనారాజు చనిపోవడంతో ఆయన భార్య పచ్చిగళ్ళ చిన్నారి తన ఇద్దరు కుమార్తెల చదువుకు ఇబ్బంది నేపథ్యంలో శుక్రవారం ఉదయం గద్దె క్రాంతి కుమార్ ఇజ్రాయెల్ పేటలోని వారి ఇంటికి వెళ్లి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ తండ్రి చనిపోవడంతో పచ్చిగళ్ళ సంజన, సాక్షి ఇద్దరు ఆడపిల్లలు చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు తాను ఈ ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు.
బడ్డికొట్టులో సరుకులు నిమిత్తం 3 వేలు ఆర్థిక సహాయం
ఇజ్రాయిల్ పేటకు చెందిన కర్ర ఎస్తేరమ్మ ఉపాధి నిమిత్తం బడ్డీ కొట్టు నడుపుకునేందుకు సరుకులు కొనుగోలు నిమిత్తం గద్దె క్రాంతి కుమార్ రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మల్లెల రామకృష్ణ, బద్దూరి వీరారెడ్డి, మెరకనపల్లి నాగేశ్వరరావు, రెడిపొంగు జైహిందరావు, బొప్పూరి భవాని, కర్రా సురేష్, బొప్పూరి యోహాన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News