విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ సొమవారం శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా పరిగణించినందున, ఈ నెల 30వ తేది సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేయడమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులతో సహకరించవలసిందిగా నగర పాలక సంస్థ కమిషనర్ కోరారు.
Read More »Konduri Srinivasa Rao
286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, నగరంలో 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ సమావేశంలో ఐదుగురు సభ్యుల ఎన్నిక అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత …
Read More »అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధ్యానత…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -కరోనా ఫ్రీ నగరంగా విజయవాడ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు -రాజ్యాంగబద్దంగా నామినేషన్ పద్దతిలోనే ఐదుగురి సభ్యుల ఎన్నిక : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కౌన్సిల్ లో మంచి నిర్ణయలు తీసుకుని విజయవాడను అభివృద్ది దిశగా తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా బీసీ లకు అధిక ప్రాదాన్యత ఇవ్వడం జరిగిందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నగర మేయర్ …
Read More »తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం పునరంకితమవుతుందని, పాఠశాల నుంచి పరిశోధన స్థాయి వరకు అన్ని దశల్లో తెలుగు అమలు కోసం తగిన కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తెలుగు మరియు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం వేడుకగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేశ్ మాట్లాడుతూ తెలుగు అక్షరాలు కూడా నేర్చుకోకుండానే పి.జి కోర్సు …
Read More »బుడమేరు ముంపు వాసులకు పునరావాసం… : మల్లాది విష్ణు
-దేవీనగర్ లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం… -వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను సుగుమం చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి శనివారం దేవీనగర్ మధ్య కట్టలో ఆయన పర్యటించారు. ఈ …
Read More »ప్రజల వద్దకే పరిపాలన సాకారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కేవలం మాటలకే పరిమితం అయిన ప్రజల వద్దకే పరిపాలన ను సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం నియోజకవర్గంలోని హరిజనవాడ 12 వ సచివాలయ పరిధిలో సిబ్బంది, కార్పొరేటర్ తో కలిసి ప్రభుత్వం చేపట్టిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన,సంక్షేమ …
Read More »ఆనందయ్య మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక 2వ డివిజిన్లో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ నిర్మలాకుమారి దాదాపు 2000 మంది స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ హయాం నుండి …
Read More »భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంనందు 3 వ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం ఉదయం 7 గం.లకు ఆర్జిత సేవ గానూ మరియు 10 గం.లకు (తెల్ల రేషన్ కార్డు దారులకు) ఉచితముగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరిగినది. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భక్తిశ్రద్ధలతో వ్రతం మహిళా భక్తులు ఆచరించారు. దేవస్థానం వారు వ్రతమును అవసరమగు పూజా వస్తువులను ఉచితంగా సమకూర్చారు. వరలక్ష్మీ దేవి వ్రతం మరియు శ్రావణ శుక్రవారం సందర్భంగా …
Read More »ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే సిటిజన్ అవుట్రీచ్ కాంపైన్ కార్యక్రమం నిర్వహణ…
-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -వార్డు సెక్రటరీలు, వాలెంటీర్లు తమ పరిదిలోని ఇంటింటీకీ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకొని డేటా ఎంట్రీ చెయ్యాలి… -కలెక్టర్ జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానలక్ష్య లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు శుక్రవారం స్థానిక తొమ్మిదవ వార్డు రంగనాయకమ్మ వీధిలో మంత్రి …
Read More »శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని, కలెక్టర్ జే నివాస్…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెంలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, అసిస్టెంట్ కలెక్టర్ శోభికకు పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ …
Read More »