-త్వరలోనే సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తాము : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మామండూరు లోని ఫారెస్ట్ ఏరియా ను సందర్శించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి అందుబాటులోనికి తీసుకొని వస్తాము అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం రేణిగుంట మండలంలోని మామండూరు ఫారెస్ట్ ఏరియా లోన్ పలు ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వులోని శ్యామల వ్యాలీ …
Read More »Daily Archives: March 13, 2025
రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా.. రీసర్వే పక్రియ
-బోనుపల్లి గ్రామoలో ఇది వరకు జరిగిన రీసర్వే పక్రియ లో దొర్లిన తప్పులను సరిచేసి పక్కగా రీసర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తొట్టంబేడు, బోనుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా.. రీసర్వే పక్రియ అని బోనుపల్లి గ్రామoలో ఇది వరకు జరిగిన రీసర్వే ప్రక్రియ లో దొర్లిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేపట్టడం జరుగుతుందని రైతులకు తెలియజేశారు. గురువారం శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామం లో కాళహస్తి ఆర్టిఓ భాను …
Read More »రామాయణాన్ని సంస్కృతం నుండి సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన కవయిత్రి మొల్ల
-వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సామాన్యులకు సైతం సరళంగా అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన కవయిత్రి మొల్ల : జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగుభాషలోకి అనువదించి రాసిన ఘనత కవయిత్రి మొల్ల వారిది అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ నందు జిల్లా వెనుకబడిన సంక్షేమ …
Read More »ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,187 మంది విద్యార్థులు హాజరు
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ – I మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 32,187 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32,187 మంది విద్యార్థులు హాజరయ్యారని …
Read More »ఆధ్యాత్మిక నగరంగా అమరావతి
-దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఆర్డీఏ పరిధిలోని టిటిడి ఎస్వీ ఆలయంలో మార్చి 15 న జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవంతో ఆధ్యాత్మిక నగరంగా అమరావతి మారనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్వీ టెంపుల్ సమీపంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధానిలో టిటిడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టిటిడి ఆలయాన్ని నిర్మించాలని …
Read More »పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
-పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు , నిరంతర విద్యుత్తు సరఫరా, మెడికల్ క్యాంపు నిర్వహించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 25,723 మందివిద్యార్ధులు 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి క్షేత్ర స్థాయి విద్యా అధికారులు …
Read More »జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు బయాలజిస్ట్ రామారావు నేతృత్వంలో కాకాని జంక్షన్ నుండి బుడంపాడు జంక్షన్ వరకు కార్మికులు జాతీయ రహదారి వెంబడి ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలు గుట్టలుగా ఉంటున్నాయని, రాత్రి సమయాల్లో వ్యర్ధాలను వేసే వారిని గుర్తించడానికి …
Read More »అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో గ్రీనరీ, పరిశుభ్రత ఉండేలా అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని క్యాంటీన్ వద్ద వారం రోజుల్లో ఉన్న ఫ్లోర్ …
Read More »రోడ్లకు ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన, అంతర్గత రోడ్లకు ప్యాచ్ వర్క్ లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఏఈల వారీగా ప్యాచ్ వర్క్ లపై భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను, జిఎంసి వెహికిల్ షెడ్ లో పారిశుధ్య పనులకు అవసరమైన సామాగ్రిని పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »వైసిపి సర్కారు వారసత్వంగా రూ.2,536 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలిచ్చింది
-బకాయిలను కూటమి ప్రభుత్వం తీరిస్తూ వస్తోంది -అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ పథకం అమలులో పేరుకుపోయిన బకాయిలు తమకు వైసిపి ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చాయని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గురువారం శాసనమండలిలో సభ్యులు ఇళ్ళా వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, బొర్రా గోపి మూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వ హయాంలో రూ.2,536 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని, కూటమి ప్రభుత్వం …
Read More »
Prajavartha Online Telugu News