Breaking News

Daily Archives: April 1, 2025

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆదివాసీ గిరిజనుల ఇంటి నిర్మాణాలకు అదనంగా రూ. 3,220 కోట్ల సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆదివాసీ గిరిజనులు (PVTG) ఇంటి నిర్మాణాల్లో పడుతున్న కష్టాలు మరియు ఆర్ధిక ఇబ్బందులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. రాజబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న 5.99 లక్షల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తి చేసుకునేందుకు రూ. …

Read More »

ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌తో స‌జావుగా పెన్ష‌న్ల పంపిణీ

– పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా మంగ‌ళ‌వారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ప్ర‌భుత్వ విప్‌, స్థానిక శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య నందిగామ మండ‌లం, ఐత‌వ‌రం గ్రామంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్లు అందిస్తున్న ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. కేట‌గిరీల వారీగా ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ మొత్తాన్ని అందిస్తున్న తీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ, శాస‌న‌స‌భ్యులు …

Read More »

మూగ‌జీవాల‌కు తాగునీటికి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు

– గ్రామాల్లో యుద్ద‌ప్రాతిప‌దిక‌న నీటి తొట్టెల ఏర్పాటు – ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో నిర్మాణం – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేస‌వి ఎండ‌ల దృష్ట్యా మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని.. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, ప్ర‌భుత్వ విప్‌, స్థానిక శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ, శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య మంగ‌ళ‌వారం నందిగామ …

Read More »

పేద‌ల సామాజిక భ‌ద్ర‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– ఎన్‌టీఆర్ భ‌రోసాతో పేద‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న‌ – పేద‌ల సేవే ప‌ర‌మావ‌ధిగా ఇంటివ‌ద్దే పెన్ష‌న్ల పంపిణీ – జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌ల సామాజిక భ‌ద్ర‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని.. ఎన్‌టీఆర్ భ‌రోసాతో నిరుపేద‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న క‌ల్పిస్తోంద‌ని, పేద‌ల సేవే ప‌ర‌మావ‌ధి అన్న స్ఫూర్తితో ల‌బ్ధిదారుల‌కు ఇంటివ‌ద్దే పెన్ష‌న్ల పంపిణీ చేస్తున్న‌ట్లు సీసీఎల్ఏ, జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి తెలిపారు. సామాజిక పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం ప‌రిశీల‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం జిల్లా ప్ర‌త్యేక అధికారి …

Read More »

ఘనంగా భారతీ తీర్థ మహా స్వామి 75వ జన్మదినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారి 75వ జన్మదినోత్సవ వేడుకలు సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణతో కూడిన వేద సప్తాహము మరియు వేదశాస్త్ర పండిత సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠం భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక …

Read More »

జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి..

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక బంగారంలా మారిపోయిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పేరుకే ఉచితమైనా.. స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీల పేరిట అధికమొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదికి రూ. 3 వేల కోట్ల ఆదాయం ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చేదని.. కానీ ఈ ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కిందిస్థాయి …

Read More »

లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2024-25 ఏడాదికి సంబందించి ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ & మోనిటరింగ్ సిస్టం (ఓబిఎంఎంఎస్)లో ప్రభుత్వ స్వయం ఉపాధి పధకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నెల 3వ తేదీ బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పశ్చిమ నియోజకవర్గంలో 4వ తేదీ ఎన్టీఆర్ స్టేడియంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 7వ తేదీ అమరావతి రోడ్ నవీన స్కూల్ ల్లో లబ్దిదారుల దరఖాస్తుల పరిశీలన క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరిగిందని నగర …

Read More »

పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం సహించం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని, పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ కృష్ణ నగర్, అశోక్ నగర్, కోబాల్ట్ పేట, లక్ష్మీపురం, లాలాపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుధ్య పనుల కోసం …

Read More »

వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు తెలియచేస్తోంది.ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోంది. ఈ మేరకు లోక్ సభలోని జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని జనసేన పార్లమెంట్ సభ్యులకు తెలిపారు. ‘వక్ఫ్ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి …

Read More »

ఉపాధి హామీ ద్వారా పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణం

-12,500 నీటి తొట్టెల నిర్మాణం కోసం రూ.56.25 కోట్లు నిధులు -ఈ నెల 15నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లెల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతోపాటు రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నారు. గోకులాల నిర్మాణం, పంట నీటి కుంటల తవ్వకాన్ని ఉపాధి హామీ పథకంలో భాగం చేసిన విధంగానే ఇప్పుడు పాడి రైతుల కోసం మరో కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. వేసవిలో …

Read More »