తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) – రాష్ట్రీయ బాల స్వస్థ్య కారిక్రమం (RBSK) చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ను గౌరవనీయ జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) డా. బాలకృష్ణ నాయిక్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ (DPMO) డా. శ్రీనివాస్ రావు, జిల్లా సర్వేలెన్స్ అధికారి (DSO) డా. హరిత, RBSK ప్రోగ్రాం అధికారి డా. పద్మావతి, వైద్యాధికారి డా. అంహిగ్నా, DEIC మేనేజర్ డా. గుణశేఖర్ మరియు DEIC సిబ్బంది పాల్గొన్నారు. ఈ చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ముఖ్య లక్ష్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHCs) వైద్యాధికారులు గుర్తించిన పిల్లలను రెఫరల్ చేయడమే. ఈ వాహనం ద్వారా పిల్లలను DEIC-తిరుపతికి తరలించి, పూర్తి స్థాయి స్క్రీనింగ్ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన చికిత్స పూర్తయిన తరువాత, పిల్లలను వారి సంబంధిత PHCs లేదా పాఠశాలలకు తిరిగి పంపిస్తారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ, “ఈ వాహనం ద్వారా పిల్లల ఆరోగ్య సమస్యలను సమయానికి గుర్తించి, అవసరమైన వైద్య సేవలను అందించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు ఆరోగ్య సిబ్బంది ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమం NHM-RBSK కింద జిల్లాలో పిల్లల ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. DEIC సిబ్బంది మరియు ఫీల్డ్ లెవెల్ వైద్య సిబ్బంది కలిసి ఈ వాహన సేవల ను సమర్థవంతంగా ఉపయోగించాలని కలెక్టరు గారు సూచించారు.
Prajavartha Online Telugu News