విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగాలు యస్పైర్ 2కె 25 పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ జ సింత క్వద్రాస్ మాట్లాడుతూ విద్యార్థినులలో వున్న సృజనాత్మతను వెలికి తీయడానికి, ప్రతిభను కన పరచటానికి ఈ ప్రోగ్రాం తోడ్పడుతుందని తెలిపారు. కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీన క్వద్రశ్ మాట్లాడుతూ ఒత్తిడి నీ అధిగా మించటానికి పోటీలలో పాల్గొనాలని కళలలో రాణించాలని విజేతలుగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి పాల్గొన్నారు క్విజ్,వ్యాసరచన,స్పెల్ బీ, మిస్టర్ మిస్ పోటీలు నిర్వహించారు 50 మంది విద్యార్థినులు పాల్గొన్నారు విజేతలకు ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న వున్నాం బహుమతులు అంద చేసారు. కామర్స్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థినులు 500 మంది హాజరయ్యారు కామర్స్ విభాగాధిపతి పూజిత మరియు అధ్యాపకులు మల్లీశ్వరి,మంజుల,పద్మజ, శ్వేత,ప్రసన్నత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News