విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనఖి నిర్వహించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం మధ్యాహ్నం గాంధీజీ మహిళా కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ ను భోజన సమయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి భోజనంలో నాణ్యత ఎలా ఉంది, సమయానికి భోజనం పెడుతున్నారా, త్రాగునీరు, వాడుక నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వంటి విషయాలపై అర తీశారు. అన్న క్యాంటీన్ లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని, అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News