-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణలంక జాతీయ ప్రధాన రహదారి వద్ద గల అన్న క్యాంటీన్ ను సందర్శించారు. అక్కడున్న ఆహార నాణ్యత ప్రజలను అడిగి తెలుసుకున్నారు, కిచెన్ లో పరిశుభ్రతను స్వయంగా వీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని త్రాగునీరు సౌకర్యం నిరంతరాయంగా ఉండాలని వాడుక నీటి పైపులైన్ లో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, అన్న కంటిలో ఆహారం కోసం వచ్చే ప్రజలు బయట కూడా టేబుల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News