రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బేటీ బచావో బేటీ పఢావో యొక్క లక్ష్యాలు దేశంలోని పౌరుల ఆలోచనా ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడంలో అవగాహన కల్పించడం కోసం మహిళ లతో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి, అదనపు ఎస్పీ సుబ్బరాజు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పుష్కర్ ఘాట్ నుంచీ దేవి చౌక్ వరకు మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ,బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ద్వారా పౌరుల ఆలోచనాధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు ,సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం మహిళ దినోత్సవ వేడుకలు వారోత్సవాలు సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల లింగ నిష్పత్తిని (CSR) తగ్గించడంతో పాటు అనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆడపిల్లలను రక్షించడంతోపాటు లింగ-ఆధారిత అసమానతలను తొలగిస్తూ మహిళా సాధికారతను కూడా పెంచుతుందన్నారు. ఆడపిల్లల విద్య మరియు వారి సామాజిక భాగస్వామ్యం సమాజ పరిణామ క్రమంలో ఎంతో ప్రాధాన్యతా కలిగి ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుబ్బ రాజు , డిఎస్పీ లు భవ్య కిశోర్, బి విద్య , మహిళా పోలీసు సి ఐ మంగదేవి , ఎస్ ఐ అమీనా బేగం, ఐసిడిఎస్ అధికారులు బేబీ రాణి, మహిళ పోలీసులు, ఐ సి డి ఎస్ సిబ్బంది , ఇతర అధికారులు సిబ్బంది, మహిళలు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News