-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర్ పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలలో తమ ఫిర్యాదులను దరఖాస్తు చేసుకొని అధికారులకు అందించవచ్చని తెలిపారు. నగరంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం పొందాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News