Breaking News

పేదలను ఇబ్బంది పెట్టకుండా మున్సిపాలిటీల ఆదాయం పెంచాలి

-మున్సిపాలీటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలి
-మున్సిపల్ కమిషనర్లు ఫీల్డ్ విజిట్ తప్పనిసరిగా చేయాలి
-అన్న క్వాంటీన్ల నిర్వహణ సజావుగా ఉండేలా సమీక్షించాలి
-మున్సిపాలిటీల రాబడిని రూ. 500 కోట్లకు పెంచినందుకు సిబ్బందికి ధన్యవాదాలు
-పొంగూరు నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపాలిటీలు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో గురువారం మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాపు ను నిర్వహించారు.. ఆ వర్క్ పాపుకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చే విధంగా మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి వారికి కావలసిన నిధులను వారే ఖర్చుపెట్టే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో ట్యాక్స్ రాబడి పెంచేలా పనిచేయాలన్నారు. మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా మున్సిపల్ కమిషనర్లు పనితీరు ఉండాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు శాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ లతో పాటు త్రాగు నీరు, స్ట్రీట్ లైట్ లు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు పెరిగేలా కృషి చేయాలన్నారు.

గతేడాది కంటే ఈసంవత్సరం పన్నుల వసూళ్లు రూ. 500 కోట్లు ఎక్కువగా వసూలు చేసినందుకు మున్సిపల్ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు. మున్సిపాలిటీల్లో రోజువారీ కార్యకలాపాలు నిర్వహణకు పన్నుల వసూలు చాలా కీలకం అన్నారు. పన్నుల ఆదాయంతో అనవసరమైన భవనాలు నిర్మించకుండా ఆ నిధులను ప్రజలకు కనీస వసతుల కల్పన కు మున్సిపాలిటీలు ఖర్చు చేయాలన్నారు. మున్సిపాలిటీల ఆదాయం ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గుంటూరులో కుక్క కరిచి బాలుడు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. 200 రోజుల లోపు కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేసేలా దృష్టి పెట్టాలన్నారు. మున్సిపాల్టీల్లో ఎస్టాబ్లిష్ మెంట్ మరియు మౌలిక వసతుల కల్పనలో ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. నెల్లూరు మున్సిపాలిటీలో గత 2014-19 సంవత్సరాల్లో పన్నుల వసూళ్లలో మేము కొత్త విధానాన్ని అమలు చేసామన్నారు. దానివల్ల రూ. 1,067 కోట్లు నెల్లూరు మున్సిపాలిటీలో రెవెన్యూ ఖర్చు పోగా రూ.40 కోట్ల రూపాయలు మిగుల ఆదాయం అప్పట్లోనే తీసుకురాగలిగామన్నారు. దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ గా ఖర్చుపెట్టే వెసులుబాటు నెల్లూరు మున్సిపాలిటీకి లభించిందన్నారు.

2014-19 సంవత్సరాల్లో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా నేనే పని చేశానని ఆ సమయంలో రూపాయి కూడా మున్సిపాలీటీల్లో పన్నులు పెంచలేదన్నారు.. లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచామన్నారు, దానివల్ల 700 కోట్ల రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి లభించిందన్నారు.. నెల్లూరు మున్సిపాలిటీలో అప్పటిలో రూ. 1,500 కోట్ల వరకు ఎస్సీ ఎస్టీ నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు.. నేను ఇప్పటికి కూడా నెల్లూరు మున్సిపల్ పన్నుల ఆదాయం ఎంత పెరిగింది, ఎంత వసూలు చేసారు అనేది కూడా సమీక్షిస్తానన్నారు. 50% స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా, మున్సిపల్ శాఖ ద్వారా 50% యంత్రాల కొనుగోలు చేస్తామన్నారు. రాబోయే కాలంలో మెకనైజేషన్ కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. నేను విదేశాల్లో తిరిగినప్పుడు ముఖ్యంగా ఈ మధ్య బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా వాళ్లు సాలిడ్, లిక్విడ్ వేస్ట్, రోడ్స్, వాటర్, లైట్స్ ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారో పరిశీలిస్తానన్నారు. అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను మన దగ్గర అమలు చేస్తామన్నారు. 85 లక్షల టన్నుల వ్యర్థాలను అక్టోబర్ 2 లోపు తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.. మున్సిపల్ కమిషనర్లు అందుకు తగ్గట్లు తమ కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలన్నారు.. అమృత్, ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు పనులకు సంబంధించి టెండర్లను త్వరలోనే పిలుస్తామన్నారు.. వేసవి కాలంలో మహిళలు త్రాగు నీటి కోసం ఇబ్బంది పడకుండా తగిన సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అన్న క్యాంటీన్లో నిర్వహణపై కూడా రెగ్యులర్ గా పరిశీలించేలా స్పెషల్ ఫోకస్ పెట్టాలని మంత్రి నారాయణ అన్నారు.

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇది డిపార్ట్మెంట్ మీటింగ్ కాదని కార్యాచరణ ప్రకారం మనం సంవత్సరకాలంలో ఏం చేయబోతున్నామో నిర్ధేశించుకుని తెలుసుకోవాలన్నారు. నగరాలలో 1.5 కోట్ల జనాభా ఉందని ఇది రాబోయే కాలంలో 2.5 కోట్లకు పెరుగుతుందని దాని ప్రకారం మన వసతులను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. ప్రాపర్టీ టాక్స్ ఏడాదిలో 49 శాతానికి పెంచిన సిబ్బందికి అభినందనీయమన్నారు.. దీన్ని 80 శాతం వరకు పెంచేలా కృషి చేయాలన్నారు.. గతంలో సక్రమంగా నిధులను ఖర్చు చేయకపోవటం వల్ల ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు విడుదల కాలేదన్నారు.. దేశంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నా వాటిని రాష్ట్రంలో అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలన్నారు..

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో సీఎఫ్ఎంఎస్ కంట్రోల్ లేకుండా మన పరిధిలోనే వచ్చే రాబడిన మనమే ఖర్చు చేసుకునేలా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి మన మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రోడ్లు, పార్కులు, స్ట్రీట్ లైట్స్ ప్రయారిటీ ప్రకారం మున్సిపల్ నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికా బద్దంగా చేయాలన్నారు. మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు ఒక డ్రైవ్ చేపట్టి రూ. 500 కోట్లు అదనపు ఆదాయం వచ్చేలా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. స్వచ్ఛాంద్ర, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ధ్యేయంగా పనిచేయాలన్నారు..

వర్క్ షాపులో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్, మెప్మా ఎండీ తేజ్ భరత్, టిడ్కో ఎండీ సునిల్ కుమార్ రెడ్డి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ ఎంకేవీ శ్రీనివాసులు, పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ మరియన్న, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, తదితరలు ఈ వర్క్ షాపులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *