ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు స్థానిక నాయకులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రింగ్ సెంటర్ లో ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మహనేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై 12 ఏళ్ల గడిచిన అ మహనీయిని జ్ణాపకాలు మన మదిలో చిరస్మరణీయమని తెలిపారు. రాజన్న పాలన మళ్ళి మనం ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ద్వార తిరిగి పోందడం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైయస్ అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News