Breaking News

యు.ఎల్.సి ఆర్జీలపై అభ్యంతరాలు స్వీకరణకు నేడు ఆఖరు తేదీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ ఆర్జీలపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 2వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికృత అధికారి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పట్టణ భూ పరిమితుల చట్టము, 1970 ప్రకారము ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణ చేసుకొనుటకు ప్రభుత్వము జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకొనే అర్జీదారులు వారి ఆధీనములో వున్న సీలింగ్ భూములను క్రమబద్ధీకరణ చేసుకొనుటకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. దాఖలు చేసిన ఆర్జీలను విచారణ చేసి జిల్లా కలెక్టరు మరియు చైర్మన్, జిల్లా స్థాయి పరిశీలనా కమిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆమోదముతో ప్రధాన కమీషనరు, భూ పరిపాలన వారికి పంపడం జరుగుతుందన్నారు. 170 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారని చెప్పారు. అర్జీదారులు దాఖలు చేసిన ఆర్జీల వివరాలను ప్రజల పరిశీలనార్ధము జిల్లా అధికారిక వెబ్ సైట్ www.guntur.ap.gov.in లో పొందుపరచడం జరిగిందన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన ఆర్జీల విషయమై ఎవరికైనా ఏదేని అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టరు మరియు అధీకృత అధికారి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కార్యాలయంలో ఆదివారం, ఆగస్టు 2వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *