విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేదారేశ్వరపేట, రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రత్యేక విక్రయ కౌంటర్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌంటర్ లో చేపట్టిన ఏర్పాట్లు పరిశీలించి బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తోందని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ ఆర్ ఐ శ్రీనివాస్, ఈ ఓ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News